పైరవీలు అవసరం లేదు | - | Sakshi
Sakshi News home page

పైరవీలు అవసరం లేదు

Oct 14 2025 7:15 AM | Updated on Oct 14 2025 7:15 AM

పైరవీలు అవసరం లేదు

పైరవీలు అవసరం లేదు

పైరవీలు అవసరం లేదు

భూపాలపల్లి: ప్రజలు పైరవీలు, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసుశాఖ సేవలు వినియోగించుకోవాలని ఎస్పీ కిరణ్‌ ఖరే సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా దివస్‌ కార్యక్రమం నిర్వహించి వివిధ గ్రామాల నుంచి వచ్చిన 12 మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా దివస్‌కు వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత దగ్గరగా ఉండడమే పోలీస్‌ శాఖ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.

ఎస్పీ కిరణ్‌ ఖరే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement