
వృత్తి శిక్షణతో ఉపాధి అవకాశాలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు ఉంటాయని ఏరియా అధికార ప్రతినిధి మారుతి తెలిపారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన వృత్తి శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన మహిళలకు సోమవారం రాత పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మారుతి హాజరై పరీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడారు. మహిళలు శిక్షణ పొందిన తర్వాత స్వయంగా ఉపాధి మార్గాలను అన్వేషించాలని సూచించారు. సింగరేణి యాజమాన్యం సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కోఆర్డినేటర్ శివకుమార్, ఏరియా కోఆర్డినేట్ అధికారి శ్రావణ్కుమార్, సేవా కార్యదర్శి రుబీనా, సేవా సభ్యులు, ఫ్యాకల్టీలు పాల్గొన్నారు.