ఆలయాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఆలయాల అభివృద్ధికి కృషి

Sep 8 2025 4:50 AM | Updated on Sep 8 2025 4:50 AM

ఆలయాల అభివృద్ధికి కృషి

ఆలయాల అభివృద్ధికి కృషి

రేగొండ: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రూ.10 లక్షలతో నిర్మించిన కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వాగత తోరణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం కోటంచలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తుల సహాయంతో ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్‌, చైర్మన్‌ భిక్షపతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కిష్టయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్‌రావు, పున్నం రవి, పట్టెం శంకర్‌, సాంబయ్య, రవీందర్‌ రెడ్డి, వీరబ్రహ్మం, ప్రమదాదేవి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement