అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Jul 25 2025 4:47 AM | Updated on Jul 25 2025 4:47 AM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

రేగొండ: అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక గ్రామంలోని రైతువేదికలో 79మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. బాలయ్యపల్లిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, హౌసింగ్‌ పీడీ లోకిలాల్‌, భూపాలపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గూటోజు కిష్టయ్య, కాంగ్రెస్‌ నాయకులు సూరం వీరేందర్‌, నర్సయ్య, వీరబ్రహ్మం, తొట్ల తిరుపతి, ఏనుగు రవీందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement