
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
ములుగు రూరల్: విద్యార్థులు లక్ష్యంతో చదవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర,శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇన్ఫోసిస్ వారి సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ను కలెక్టర్ దివాకరతో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఉంటు ఇదే పాఠశాలలో 4 నుంచి 10వ తరగతి వర కు విద్యనభ్యసించానని గుర్తు చేసుకున్నారు. చదువుపై ఆసక్తితో పీహెచ్డీ పూర్తి చేశానని వెల్లడించా రు. లక్ష్యంతో చదివితే చదువుకు పేదరికం అడ్డుకా దని వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నా భోజనం అందించడంతో పా టు పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. పాఠశాల ఆవరణలో రూ.6 లక్షలతో టాయిలెట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ చేశా రు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిశా ఫౌండేషన్, ఈఎల్ఎఫ్ ఇంగ్లిష్ వారి సహకారంతో జిల్లాలో రెండోదశ లర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని కలెక్టర్ దివాకర, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్లతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్పై పట్టు సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. గతేడాది దిశా ఫౌండేషన్ వారు జిల్లాలో 50 పాఠశాలలను ఎంపిక చేసి ఇంగ్లిష్ బోధనపై మెటీరియల్, ఉపాధ్యాయులకు శిక్షణ అందించారని తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క