
సమస్యల పరిష్కారం కోసం సదస్సులు
గణపురం: గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. గణపురం మండలం అప్పయ్యపల్లె గ్రామంలో శుక్రవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు హాజరై మాట్లాడారు. రెవెన్యూ శాఖ అందించే సేవలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణస్వామి, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్కుమార్