టీబీ రహిత జిల్లాగా మార్చాలి | - | Sakshi
Sakshi News home page

టీబీ రహిత జిల్లాగా మార్చాలి

Jun 7 2025 1:32 AM | Updated on Jun 7 2025 1:32 AM

టీబీ రహిత జిల్లాగా మార్చాలి

టీబీ రహిత జిల్లాగా మార్చాలి

జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు

ములుగు రూరల్‌ : ములుగును టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషిచేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు పేర్కొన్నారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో 100 రోజుల అవగాహన కార్యక్రమాల ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మొదట టీబీ బాధితులు, మద్యపానానికి గురైన వ్యక్తులు, మధుమేహం కలిగినవారు, హెచ్‌ఐవీతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించాలన్నారు. ప్రతీఒక్కరికి తెమడ పరీక్షల నిర్వహణకు గ్రామాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. నడవలేని వారి వివరాలను సేకరించి 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి ఎక్స్‌రేలు, సిబినాట్‌ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని అన్నారు. టీబీ మిత్రను భాగస్వాములను చేసి న్యూట్రిషన్‌ కిట్లు, ఆర్థికసాయం అందించాలని తెలిపారు. టీబీపై ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆరోగ్య, ఆశ కార్యకర్తలు సమన్వయంతో పోషకాహారలోపం ఉన్న వ్యక్తులు గుర్తించి తెమడ పరీక్షలు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ దుర్గారావు, టీబీ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ సమ్మయ్య, చంద్రమౌళి, రాజు ల్యాబ్‌ టెక్రిషియన్‌, ప్రోగ్రాం సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement