
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
చిట్యాల: భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని దూత్పల్లి, భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. అనంతరం అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని వాటిని ఆన్లైన్, రిజిస్టర్లో నమోదు చేస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివరాల నమోదులో తప్పిదాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. స్వీకరించిన దరఖాస్తులను రిజిస్ట్రర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్డెస్క్లను, రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారిగా అర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులను పొందుపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల, భూపాలపల్లి తహసీల్దార్లు షేక్ ఇమామ్ బాబా, శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్ కుమార్