యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలి

Jun 5 2025 7:32 AM | Updated on Jun 5 2025 7:32 AM

యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలి

యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలి

రేగొండ: కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణపురం మండలంలోని బుద్దారం నుంచి కోటంచ ఆలయం వరకు జరుగుతున్న డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఆలయానికి సంబంధించిన ఆర్చి పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. ఆలయ గర్భగుడి పనుల పురోగతిపై చర్చించారు. అన్ని అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆలయానికి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్‌, ఛైర్మన్‌ బిక్షపతి, పీఆర్‌ డీఈ రవికుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సౌజన్య, కాంగ్రెస్‌ నాయకులు సంపత్‌రావు, పున్నం రవిభాస్కర్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement