
ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన
టేకుమట్ల: మండలంలోని అంకుషాపూర్–సోమనపల్లి ఆంజనేయస్వామి ఆలయ పునఃనిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలకు అంకుషాపూర్, సోమనపల్లి గ్రామాల ప్రజలు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్రెడ్డి హాజరై మొక్కులు చెల్లించారు. వారి వెంట మాజీ వైస్ ఎంపీపీ పోతనవేని ఐలయ్య, మాజీ సర్పంచ్లు ఉద్దమారి మహేష్యాదవ్, పండుగ శ్రీను, నందకొండ రాంరెడ్డి, మంద రవి, నాయకులు తోట సాగర్, ఆలయ కమిటీ సభ్యులు, ఉన్నారు.