ప్రజల్లో ధైర్యం కల్పించేందుకే కవాతు | - | Sakshi
Sakshi News home page

ప్రజల్లో ధైర్యం కల్పించేందుకే కవాతు

May 31 2025 1:16 AM | Updated on May 31 2025 1:16 AM

ప్రజల్లో ధైర్యం కల్పించేందుకే కవాతు

ప్రజల్లో ధైర్యం కల్పించేందుకే కవాతు

హసన్‌పర్తి: ప్రజల్లో ధైర్యం కలిగించేందుకు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ కవాతు నిర్వహిస్తున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. శుక్రవారం హనుమకొండ సబ్‌ డివిజన్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సన్‌ప్రీత్‌సింగ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి కవాతు ప్రారంభించారు. హనుమకొండ బస్టాండ్‌, బ్రాహ్మణవాడ, అలంకార్‌ జంక్షన్‌, చౌరస్తా మీదుగా అశోక్‌ జంక్షన్‌ వరకు కవాతు సాగింది. అనంతరం కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ.. కేంద్రహోం శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈకార్యక్రమం ఏడు రోజులు కొనసాగుతుందన్నారు. కమిషనరేట్‌ పరిధి వివిధ పోలీస్‌స్టేషన్లలో కవాతు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎలాంటి అల్లర్లు, మత ఘర్షణ తలెత్తినా తక్షణమే స్పందించి స్థానిక పోలీసులకు సహకారం అందిస్తూ ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించడమే లక్ష్యంగా కవాతు నిర్వహిస్తున్నట్లు సీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా, ఆర్‌ఏఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ సరస్వతి, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌, రవికుమార్‌, సత్యనారాయణరెడ్డితో పాటు పోలీస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఏడు రోజుల పాటు కార్యక్రమాలు

పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement