విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి

May 8 2025 9:08 AM | Updated on May 8 2025 9:08 AM

విధి నిర్వహణలో  జాగ్రత్తలు పాటించాలి

విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి

ములుగు: విధి నిర్వహణలో ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని టీజీఎన్పీడీసీఎల్‌ ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల డీఈలు పులుసం నాగేశ్వరరావు, వెంకటేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సబ్‌ డివిజన్ల విద్యుత్‌ సిబ్బందితో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎల్‌సీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం భద్రతా వారోత్సవాల వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిబంధనలు పాటించాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement