ప్రజల వద్దకే తపాలా సేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రజల వద్దకే తపాలా సేవలు

Mar 2 2025 2:14 AM | Updated on Mar 2 2025 2:10 AM

రేగొండ: ప్రజల వద్దకు పోస్టాఫీస్‌ సేవల కార్యక్రమంలో భాగంగా పరకాల ఏఎస్పీ అనంత్‌రామ్‌ నాయక్‌ శనివారం కొత్తపల్లిగోరి మండలంలోని రాజక్కపల్లి, చిన్నకోడేపాక, చెన్నాపూర్‌ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసరా పెన్షన్‌, ఉపాధిహామీ నగదును లబ్ధిదారులకు అందజేశారు. నిస్సహాయక పెన్షన్‌దారులు కొండెటి సూరమ్మ ఇంటికి వెళ్లి పెన్షన్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టాఫీస్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూ.755లకు రూ.15 లక్షల ప్రమాదబీమా సౌకర్యాన్ని ప్రజలు ఉపఝెగించుకోవాలని అన్నారు. తపాలాశాఖ మినీ ఏటీఎం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట తపాలా సిబ్బంది సంతోష్‌, కృష్ణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement