పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం

Aug 5 2025 6:40 AM | Updated on Aug 5 2025 6:40 AM

పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం

పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం

జగనామ: హిందువులు, ప్రకృతి ఆరాధకులు ప్రాణాధార, ఔషధ మొక్కలను పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో విశ్వహిందూ పరిషత్‌, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దైవిక మొక్కలు నాటి హరిత సంకల్పాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వృక్ష సంపదను పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుత్యతను కాపాడాలన్నారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు గజ్జెల నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరు ఒక మొక్క నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాశం శ్రీశైలం, గోవర్ధన్‌, యాదగిరి, హనుమారెడ్డి, అనిల్‌, సాయిసుజీత్‌, నాగమణి, జక్క జ్యోతి, ధనలక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు.

వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి

మోహనకృష్ణ భార్గవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement