నాణ్యమైన విద్యుత్‌ అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

Aug 5 2025 6:40 AM | Updated on Aug 5 2025 6:40 AM

నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

జనగామ: జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల ఫెల్యూర్స్‌ను తగ్గించి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని ఎన్‌పీడీసీఎల్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌ అన్నారు. సోమవారం సర్కిల్‌ కార్యాలయంలో గత నెలలో జరిగిన పనులు, టార్గెట్‌, ప్రస్తుత మాసంలో చేయాల్సిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ జరిగే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. 33 ఇంటర్‌ లింకింగ్‌ లైన్‌ పూర్తి చేయడంతో పాటు వ్యవసాయ సర్వీస్‌లను వెంటనే రిలీజ్‌ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో చీఫ్‌ ఇంజనీర్‌ రాజ చౌహన్‌, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ వేణుమాధవ్‌, డీఈ టె క్నికల్‌ గణేష్‌, ఎస్‌ఏఓ జయరాజు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, రాంబాబు, విజయకుమార్‌, ఏడీ, ఏఈలు పాల్గొన్నారు.

ఎన్‌పీడీసీఎల్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌

మధుసూదన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement