ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలి● | - | Sakshi
Sakshi News home page

ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలి●

Aug 2 2025 6:32 AM | Updated on Aug 2 2025 6:32 AM

ప్రతిఒక్కరూ పరిశుభ్రత  పాటించాలి●

ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలి●

జిల్లా పంచాయతీ అధికారి స్వరూప

జఫర్‌గఢ్‌: ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి స్వరూప కోరారు. మండల కేంద్రంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణతో పాటు గ్రామ పరిసరాలు, అంగడిని పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పారిశుద్ధ్యం విషయంలో పంచాయతీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement