అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ

Jul 27 2025 6:58 AM | Updated on Jul 27 2025 6:58 AM

అవయవ దానంతో  మరొకరికి పునర్జన్మ

అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ

సదాశయ ఫౌండేషన్‌

జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌

ప్రొఫెసర్‌ ప్రభంజన్‌ సంస్మరణ సభ

పాలకుర్తి టౌన్‌: అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ లభిస్తుందని, మరణ అనంతరం కూ డా మానవ శరీరాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని సదాశయ ఫౌండేషన్‌ జాతీ య అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్‌, చౌడవరపు లింగమూర్తి అన్నారు. శనివారం మండలంలని గూడూరులో సీనియర్‌ జర్నలిస్టు, ప్రొఫెసర్‌ యాదాలన ప్రభంజన్‌ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీర దానం వైద్య కళాశాల విద్యార్థుల విద్యాబోధనకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ప్రభంజన్‌ సతీమణి మంచిర్యాల వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రేఖ మాట్లాడుతూ తన భర్త ఉన్నంతకాలం జర్నలిజం ప్రొఫెసర్‌గా, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనేవారన్నారు. అ నంతరం ఫౌండేషన్‌ జ్ఞాపికను ప్రభంజన్‌ కు టుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో కన్వీనర్‌ చౌడవరపు శ్రీనివాస్‌, ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌, రాజయ్య, రవీందర్‌, తదితురులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement