
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా శ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా ఆవిభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆవిభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ పెద్దమళ్ల శ్రీనివాస్రావు కొద్దిరోజుల క్రితం రాజీనామా చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రొఫెసర్లు ఎవరూ లేకపోవడంతో శ్రీనివాసులును నియమించారు. నేడు(మంగళవారం) ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన ఆవిభాగానికి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, విశ్వవిద్యాలయం మహాత్మాజ్యోతిరావు పూలే సెల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం.. శ్రీనివాసులకు నియామక ఉత్తర్వులు అందజేశారు.