● డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య
జగిత్యాలటౌన్: సాయుధ పోరాటం నుంచి రైతాంగ పోరాటం వరకు మరువలేని చరిత్ర తెలంగాణ సొంతమని, అస్తిత్వ పోరాటానికి ప్రతీకగా నిలుస్తుందని డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య అన్నారు. జగిత్యాల తహసీల్ చౌరస్తాలో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి, పీసీసీ సెక్రటరీ బండ శంకర్, పీసీసీ సేవాదళ్ సెక్రటరీ ముకేష్ ఖన్నా, చాంద్పాషా, బీరం రాజేశ్, చెట్టే భార్గవ్, బాల ముకుందం పాల్గొన్నారు.


