నీటి తడులు అందిస్తున్న | - | Sakshi
Sakshi News home page

నీటి తడులు అందిస్తున్న

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

అదును దాటిపోతుందని పసుపు సాగు చేశాను. కొద్దిరోజులుగా డ్రిప్‌ ద్వారా తడులు ఇచ్చాను. ఆ నీరు సరిపోవడం లేదని నాలుగైదు రోజులుగా పైపుల ద్వారా పారిస్తున్నాను. వ్యవసాయ బావిలో ఉన్న నీరు ఇప్పుడు సరిపోవడం లేదు. వర్షాల కోసం ఎదురుచూడని రోజంటూ లేదు.

– కొలగాని రాంకిషన్‌,

వెల్దుర్తి, జగిత్యాల రూరల్‌(మం)

విత్తనాలు తెచ్చిపెట్టుకున్న

మల్లాపూర్‌: నాకున్న పొలంలో సోయా, మొక్కజొన్న, పసుపు, మిర్చి పంటలు సాగు చేద్దామని భూమినంతా కలియదున్నిచ్చి సిద్ధం చేశాను. విత్తనాలూ కొనుగోలు చేశాను. వర్షాలు పడితే విత్తుకుందామని చూస్తున్న. వాన జాడే లేకుండా పోయింది.

– ఏలేటి మహేష్‌రెడ్డి, రైతు, కొత్తదాంరాజుపల్లి

ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఈ ఏడాది రుతుపవనాలు మందగించాయి. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకు లోటు వర్షపాతమే ఉంది. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి వంటి పంటలను ఇప్పుడే సాగు చేయవద్దు. కంది, పెసర, చిరు ధాన్యాలు వంటి పంటలు సాగు చేసుకుంటే బాగుంటుంది.

– వడ్డెపల్లి భాస్కర్‌, డీఏవో

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement