నాకు కొడిమ్యాల మండలం కోనాపూర్ పరిధి సర్వేనంబర్ 238ఆలో 1.28 ఎకరాల భూమి ఉంది. వ్యక్తిగత అవసరాల కోసం ఆ భూమిని అమ్మకానికి పెట్టిన. మార్చి 18న స్లాట్ బుక్ చేసిన. సాయంత్రం 5గంటలు దాటినా రిజిస్ట్రేషన్ చేయలేదు. డాక్యుమెంట్ రైటర్ను సంప్రదిస్తే సర్వే నంబర్ 238లో అసైన్డ్ పట్టా వస్తున్నందున తహసీల్దార్ రూ.2లక్షలు అడుగుతున్నాడని చెప్పాడు. పట్టా పాస్బుక్తోపాటు అన్ని హక్కులు ఉన్న నా పట్టా భూమిని విక్రయించుకునేందుకు అనుమతించేలా చూడండి.
– వొల్లాల నర్సయ్యగౌడ్, నారాయణపూర్, గంగాధర


