హైదరాబాద్‌ టీ–20 మహిళల జట్టులో శ్రీవల్లి | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టీ–20 మహిళల జట్టులో శ్రీవల్లి

Oct 2 2025 8:31 AM | Updated on Oct 2 2025 8:31 AM

హైదరాబాద్‌ టీ–20 మహిళల జట్టులో శ్రీవల్లి

హైదరాబాద్‌ టీ–20 మహిళల జట్టులో శ్రీవల్లి

కరీంనగర్‌స్పోర్ట్స్‌/ఇల్లంతకుంట(మానకొండూర్‌): హైదరాబాద్‌ మహిళల టీ–20 క్రికెట్‌ జట్టులో కరీంనగర్‌కు చెందిన క్రీడాకారిణి కట్ట శ్రీవల్లి చోటు సంపాదించింది. హైదరాబాద్‌ సీనియర్‌ మహిళల టీ–20 క్రికెట్‌ జట్టును క్రికెట్‌ సంఘం బాధ్యులు బుధవారం ప్రకటించారు. అక్టోబర్‌ 8 నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బీసీసీఐ టీ20 టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నమెంట్‌లో భాగంగా పాల్గొనే హైదరాబాద్‌ సీనియర్‌ మహిళల జట్టులో శ్రీవల్లి చోటు దక్కించుకుంది. శ్రీవల్లి ఎంపికపై కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు ఆగం రావుతోపాటు తల్లిదండ్రులు కట్ట ఉమా–లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీవల్లి స్వస్థలం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామం.

మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలి

మల్లాపూర్‌ : మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు స్వస్త్‌ నారీ స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌లో భాగంగా అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. 128మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ అధికారి రవీందర్‌, మండల వైద్యాధికారి వాహిని, పీహెచ్‌సీ సీహెచ్‌వో రామ్మోహన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement