ఇసుక స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఇసుక స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేయండి

Mar 12 2025 7:55 AM | Updated on Mar 12 2025 7:49 AM

● మొక్కజొన్న, కందులు కొనాల్సిందే ● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాలటౌన్‌: భవన నిర్మాణదారులకు ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జిల్లాలో అక్రమ ఇసుక డంపులను అరికట్టడంలో కలెక్టర్‌ చొరవను అభినందించిన ఆయన.. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కజొన్నలకు గతేడాది క్వింటాల్‌కు రూ.2500 ఉండగా.. ఇప్పుడు రూ.రెండువేలకు పడిపోయిందని, మొక్కజొన్నలు, కందులు కొనాలని సీఎంకు లేఖ రాశానన్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. నాయకులు బండ శంకర్‌, కల్లెపెల్లి దుర్గయ్య, మహ్మద్‌ భారి, సురేందర్‌, రఘువీర్‌గౌడ్‌, మహేందర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement