
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆఫ్ఘన్లో వలసదారులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సుకు మంటలు అంటుకోవడంతో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి.
వివరాల ప్రకారం.. ఇటీవల ఆప్ఘన్ వలసదారులు ఇరాన్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో, వారంతా స్వదేశానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వలసదారులతో వెళ్తున్న బస్సు, మోటారు సైకిల్ ఢీకొన్నాయి. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
🚨BREAKING: At least 71 people died in Afghanistan’s Herat province when a bus carrying deported migrants crashed into a truck and a motorcycle. pic.twitter.com/HdQxk36CzC
— World Source News 24/7 (@Worldsource24) August 19, 2025
ఇక, ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు. నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా.. అఫ్గాన్ శరణార్థులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్, పాకిస్తాన్ (Pakistan) భారీ డిపోర్టేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 1.5 మిలియన్ల మందికి పైగా ఆఫ్ఘన్లు ఇరాన్, పాకిస్తాన్ నుంచి బలవంతంగా స్వదేశానికి తిరిగివచ్చారు. మరోవైపు.. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
⚡️🇦🇫 At least 71 people including 17 children were killed when a bus carrying deported migrants collided with a truck and motorcycle in Herat province, Afghanistan, before catching fire. pic.twitter.com/vapzIvuqPO
— Lala News & Stuff (@lala515711) August 19, 2025