అతి పెద్ద లిఖిత రాజ్యాంగం
హన్మకొండ: భారత రాజ్యాంగం అతి పెద్ద లిఖిత రాజ్యాంగమని, దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులతో సీఎండీ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. అధికారాలు, బాధ్యతలను సమన్వయపరుస్తూ ఎలా ఉండాలో రాజ్యాంగం నిర్దేశిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, కె.వెంకట రమణ, అశోక్, అన్నపూర్ణ, సురేందర్, శ్రవణ్ కుమార్, సీజీఎంలు రవీంద్రనాథ్, చరణ్ దాస్, జాయింట్ సెక్రటరీ శ్రీకృష్ణ, జీఎంలు గిరిధర్, శ్రీనివాస్, వాసుదేవ్, మల్లికార్జున్, నాగ ప్రసాద్, సామ్య నాయక్, హేమంత్ కుమార్, కళాధర్ రెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి


