నేడు దీక్షా దివస్ సన్నాహక సమావేశం
నయీంనగర్: ప్రతీ సంవత్సరం నవంబర్ 26 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా నేడు (బుధవారం) పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులతో హనుమకొండలో జరిగే సన్నాహక సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాలు, తెలంగాణ ఉద్యమకారుల ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమాల విజయవంతంపై కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులే కడియం బ్రాండ్ అని ఆరోపించారు. కేంద్రంలో బిడ్డకు మంత్రి పదవి ఇస్తామంటే తండ్రి, బిడ్డ జంప్ చేస్తారని అన్నారు. సమావేశంలో రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు హరి రమాదేవి, కార్పొరేటర్లు సోదా కిరణ్, చెన్నం మధు, రంజిత్ రావు, పులి రజనికాంత్,రమేష్ పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా కేటీఆర్ రాక
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా
అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్


