బీసీ రిజర్వేషన్లను సవరించాలి
హన్మకొండ: బీసీ రిజర్వేషన్ల సవరణ చేయకుండా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని టీఎస్ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ హెచ్చరించారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి తెలంగాణ అమరువీరుల స్తూపం వరకు ఆదివారం నిర్వహించిన ర్యాలీనపి ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తామని అనడం సరికాదని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఉద్యమించాలని అన్నారు. అలాగే, కేంద్రంలోని బీజేపీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా స్పందించి రాజ్యాంగ సవరణ చేయాలని, లేకుంటే ఆ పార్టీకి జూబ్లీహిల్స్ ఫలితలే పునరావృతమవుతాయని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం ముమ్మాటికీ బీసీలదేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధాన పార్టీల మధ్య ఉండదని, బీసీ వర్సెస్ ఓసీల మధ్యనే ఉంటుందని అన్నారు. బీసీ జేఏసీ నాయకులు డాక్టర్ కూరపాటి రమేశ్, బొనగాని యాదగిరిగౌడ్, మూగల కుమార్ యాదవ్, చిర్ర రాజు గౌడ్, సంగని మల్లేశ్వర్, తమ్మెలా శోభారాణి, మాదం పద్మజాదేవి, బచ్చు ఆనందం, ఆరేగంటి నాగరాజు, భీమగాని యాదగిరి, ఐలి చంద్రమౌళి, వల్లాల జగన్, పెరుమాండ్ల అనిల్, తుపాకుల రవి, పంజాల మధు, కోలా ప్రతాప్, తేల్ల సుగుణ, కిశోర్, చాగంటి రమేశ్, హైమావతి, మౌనిక, ప్రమోద, మానస పాల్గొన్నారు.
టీఎస్ బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్


