
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కాజీపేట: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో కా జీపేట 47వ డివిజన్ బాలాజీనగర్ కాలనీలో విషా దం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన రాజారపు రంజిత్(30) ఫారెస్ట్ కార్యాల య సమీపంలో డ్రైఫ్రూట్స్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో షాపు సెల్లార్లో నీరు రాకపోవడంతో బోరు వేయడానికి యత్నించగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందా డు. సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రంజిత్కు ఈ నె ల 5న కుమారుడు జన్మించా డు. ఈ ఆనందంలో ఉన్న రంజిత్ను మృత్యువు విద్యుత్ రూపంలో కబలించింద ని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.