కళాకారులను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

కళాకారులను ప్రోత్సహించాలి

Jun 14 2025 6:31 AM | Updated on Jun 14 2025 6:31 AM

కళాకారులను ప్రోత్సహించాలి

కళాకారులను ప్రోత్సహించాలి

హన్మకొండ కల్చరల్‌: కళాకారులను ప్రొత్సహించాలని, కళారంగాన్ని కాపాడుకోవాలని అందుకు కళాపోషకులు ముందుకు రావాలని కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఆచార్య బన్న అయిలయ్య అన్నారు. వరంగల్‌ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు–2025 శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈమేరకు వరంగల్‌ పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో ఆచార్య బన్న అయిలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నాటక పోటీలు ప్రారంభించారు. అలాగే పారితోషిక దాతగా వ్యవహరించారు. ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్‌ కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులుగా కవి గిరిజామనోహరబాబు, బండారు ఉమామహేశ్వర్‌రావు, వేదిక సలహాదారు సంజయ్‌బాబు, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, మాడిశెట్టి రమేశ్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం చిలుకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్‌ క్రియేషన్‌ వారి మా ఇంట్లో మహాభారతం, నిజామాబాద్‌ తన్మయి ఆర్ట్స్‌ వారి చదువు నాటక ప్రదర్శనలు అలరించాయి.

కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌

బన్న అయిలయ్య

ప్రారంభమైన ఆహ్వాన నాటిక పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement