
దీపావళి నాటికి గృహ ప్రవేశాలు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు
హన్మకొండ/హసన్పర్తి: ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మిస్తున్న వారు దీపావళి నాటికి గృహ ప్రవేశాలు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. నగరంలోని 1, 2, 3, 43, 44, 45, 46, 55, 56, 65, 66వ డివిజన్ల్లోని ఇందిరమ్మ లబ్ధిదారులకు సోమవారం అంబేడ్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంజూరు పత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. ఇళ్లు ఇప్పిస్తామని వచ్చే దళారులను నమ్మొద్దని సూచించారు. ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికస్థోమత లేనివారికి మహిళా సంఘాల ద్వారా రుణసాయం చేయాలని సూచించారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, హౌసింగ్ పీడీ రవీందర్నాయక్, కార్పొరేటర్లు జక్కుల రజిత, సిరంగి సునీల్కుమార్, షీబారాణి, అరుణకుమారి, డివిజన్ అధ్యక్షుడు కిరణ్, పొన్నాల రఘు, హరిబాబు, గడ్డం శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.