మహిళకు రక్షణ కల్పించలేని టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తక్షణమే పదవికి రాజీనామా చేయాలి. బాధితురాలికి న్యాయం చేయకుండా, నిందితులకు వత్తాసు పలకడం సిగ్గు చేటు. ఇది రాష్ట్రంలోనే అత్యంత అమానుష ఘటన. టీడీపీలోని రౌడీలు, గూండాలకు చట్టం అంటే భయం లేదు. వారికి పార్టీలో పదవులు ఇచ్చి అచ్చోసిన అంబోతుల్లా రోడ్లపైకి వదులుతున్నారు. గల్లా మాధవి ఏం మాట్లాడుతతున్నారో ఆమెకే తెలియదు. వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే పార్టీలో ఇంత మంది మహిళలం నాయకులుగా ఎదిగాం. టీడీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.
– రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ నగర మాజీ మేయర్


