కూటమి పాలనలో మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. ఆ పార్టీ వారే దాడి చేశారని, అన్యాయం జరిగిందని ఒప్పుకొన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. న్యాయం చేశామని చెప్పడం సిగ్గుచేటు. శిక్ష వేసినా న్యాయం జరగదు. రాష్ట్ర మొత్తం సిగ్గు పడాల్సిన విషయం. ఎమ్మెల్యే చెబితేనే కేసు పెడతారా? కూటమి ప్రభుత్వం వైఫల్యం వలనే మేం ఇక్కడకు రావాల్సి వచ్చింది. ప్రభుత్వంపై తిరగబడతాం. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తాం. పోలీసులు కేసు నమోదు చేయడంతోనే బాధితురాలికి న్యాయం జరగలేదు. కేసులో నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు వేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
– కాకాణి పూజితారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్


