పేలుడులో గాయపడ్డ పోలీసులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

పేలుడులో గాయపడ్డ పోలీసులకు అండగా ఉంటాం

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

పేలుడులో గాయపడ్డ పోలీసులకు అండగా ఉంటాం

మంగళగిరి టౌన్‌: కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర హోమ్‌ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ దుర్గ ఆంజనేయులు, కోర్టు కానిస్టేబుల్‌ అబ్దుల్లా, డ్రైవర్‌ నాగరాజులను సోమవారం హోమ్‌ మంత్రి అనిత పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులకు ధైర్యం చెప్పి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించినట్లు పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ అబ్దుల్లా 50–60 శాతం గాయాలతో ఉన్నారని చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. మిగిలిన ఇద్దరిని ప్రాణాపాయం లేదని తెలిపారు. గాయపడిన పోలీసుల ఆరోగ్య పరిస్థితులను కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం చికిత్సపొందతున్న వారికి మెరుగైన వైద్య అందించాలని ఎన్‌ఆర్‌ఐ వైద్యులను ఆదేశించారు.

హోం మంత్రి అనిత

Advertisement
 
Advertisement
Advertisement