ప్రతిభకు ఉపకారం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు ఉపకారం

Sep 12 2025 6:21 AM | Updated on Sep 12 2025 6:21 AM

ప్రతిభకు ఉపకారం

ప్రతిభకు ఉపకారం

ప్రతిభకు ఉపకారం ● పరీక్ష రాసేందుకు విద్యార్థినీ, విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించరాదు. ● విద్యార్థులు ఈనెల 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. పరీక్ష ఫీజు కింద ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున చెల్లించాలి. ఇందుకు సంబంధించిన యూజర్‌ మాన్యువల్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ సైట్‌లో ఉంది. ● నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష జాతీయస్థాయిలో జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనం మంజూరవుతుంది. ● మెంటల్‌ ఎబిలిటీ (మాట్‌), ఆప్టిట్యూడ్‌ (శాట్‌) అంశాల్లో ఒక్కో పేపర్‌కు 90 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహిస్తారు. 6,7,8 తరగతుల నుంచి ప్రశ్నలు వస్తాయి. 90 నిమిషాల్లో పరీక్ష జవాబులు రాయాల్సి ఉంటుంది. ● విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఈనెల 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుంను ఆన్‌లైన్‌లో పొందుపర్చిన ఎస్‌బీఐ లింక్‌ ద్వారా చెల్లించాల్సి ఉంది.

ఎన్‌ఎంఎంఎస్‌ దరఖాస్తుకు ఈనెల 30 వరకు గడువు డిసెంబర్‌ 7న రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సాయం పరీక్షలో ప్రతిభ చూపితే 9వ తరగతి నుంచి సీనియర్‌ ఇంటర్‌ వరకు ఏడాదికి రూ.12వేలు మంజూరు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిభే కొలమానంగా ఉపకార వేతనాలు దక్కనున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఇందు కోసం ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష నిర్వహిస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా వరుసగా 9,10,11,12వ తరగతుల్లో ఏడాదికి రూ.12వేలు చొప్పున ఉపకార వేతనం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. డిసెంబర్‌ 7న రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏటా 450 మంది విద్యార్థులు ఎంపికవుతున్నారు.

ఎన్‌ఎంఎంఎస్‌కు అర్హతలు

పరీక్ష విధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement