కాల్వలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కాల్వలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

Sep 4 2025 6:29 AM | Updated on Sep 4 2025 6:29 AM

కాల్వ

కాల్వలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

సింగిల్‌ నంబర్‌ లాటరీ విక్రేతలు అరెస్ట్‌

నకరికల్లు: మతిస్థిమితం సక్రమంగా లేక వృద్ధురాలు ఎన్‌ఎస్‌పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ చల్లా సురేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. చీమలమర్రి గ్రామానికి చెందిన సురభి సీతమ్మ(75) గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈక్రమంలో బుధవారం సాయంత్రం సమయంలో చల్లగుండ్ల సమీపంలోని గోరంట్ల మేజర్‌లో దూకింది. సమీపంలోని వారు గమనించి వెలికితీసే సరికే మృతిచెందింది. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి ఆరుగురు పిల్లలు ఉండగా వారందరూ వివాహితులే.

14 యూరియా బస్తాలు స్వాధీనం

దాచేపల్లి: అక్రమంగా తరలిస్తున్న 14 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సౌందర్యరాజన్‌ బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పొందుగుల రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టామని, ఈ తనిఖీల్లో గురజాల మండలం గంగవరం గ్రామం నుంచి 14 యూరియా బస్తాలను రైతులు పేరుమీద కొనుగోలు చేసి తెలంగాణలోని దామరచర్ల మండలంలోకి ఆటో ద్వారా అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని గుర్తించి యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూరియాను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సౌందర్యరాజన్‌ వెల్లడించారు.

నరసరావుపేట టౌన్‌: నిషేధిత సింగిల్‌ నంబర్‌ లాటరీ విక్రేతలు నలుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.51,480లు స్వాధీనం చేసుకున్నట్లు నరసరావుపేట ఇన్‌చార్జి డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. బుధవారం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. చిత్రాలయ టాకీస్‌ సెంటర్‌లో సింగిల్‌ నంబర్‌ లాటరీ టిక్కెట్లు విక్రయిస్తున్నారన్నా సమాచారం మేరకు టూటౌన్‌ పోలీసులు దాడులు నిర్వహించి ఇస్లాంపేటకు చెందిన షేక్‌ మస్తాన్‌వలి, ఉప్పలపాడు గ్రామానికి చెందిన పరిమి వెంకటేశ్వర్లులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.6,580 నగదు, లాటరీ నంబర్లకు సంబందించి స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారన్నారు. అదే విధంగా ఏంజెల్‌ టాకీస్‌ సమీపంలో వన్‌టౌన్‌ పోలీసులు దాడులు నిర్వహించి నిమ్మతోటకు చెందిన గుడిపాటి వెంకటేశ్వరరావు, ఇస్లాంపేటకు చెందిన షేక్‌ నన్నూ బాజీలను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.44,900 నగదు, లాటరీ నంబర్ల స్లిప్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఇస్లాంపేటకు చెందిన షేక్‌ ఖాజాషరీఫ్‌ అలియాస్‌ బుజ్జి, రామిరెడ్డిపేటకు చెందిన షేక్‌ గౌస్‌పీరాలను అరెస్ట్‌ చేయాల్సి ఉందన్నారు. నిందితులను అరెస్ట్‌ చేయటంలో ప్రతిభ కనపరిచిన వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐలు ఎం.వి.చరణ్‌, ఎం.హైమారావు, ఎస్‌ఐలు టి.అశోక్‌ బాబు, అరుణలను అభినందించారు. నిషేదిత లాటరీ, మట్కా నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

కాల్వలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య 1
1/2

కాల్వలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

కాల్వలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య 2
2/2

కాల్వలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement