
జగన్ పర్యటనలు అడ్డుకునేందుకు బాబు కుట్ర
చుండూరు(వేమూరు) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక కుట్రలు చేస్తున్నాడని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. చుండూరు మండలంలోని కారుమూరివారి పాలెంలో పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డికి అభినందన సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అశోక్బాబు మాట్లాడుతూ కారుమూరు పాలెం గ్రామానికి చెందిన కారుమూరు వెంకటరెడ్డిని పార్టీ అధికార ప్రతినిధిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నియామకం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పోలీసులకు తనకు ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని, తన ఆస్తి వైఎస్సార్ సీపీ కార్యకర్తలేనని చెప్పారు. వారికి ఏ సమస్య వచ్చినా ఎదురు నిలబడి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు మేరుగ నాగార్జున మాట్లాడుతూ పార్టీ కోసం కష్టకాలంలో పని చేసిన కార్యకర్తలకు ఎప్పడూ గౌరవం ఉంటుందని తెలిపారు. రేపల్లె నియోజకవర్గం సమన్వయకర్త ఈపూరు గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా సూపర్ సిక్స్లు అమలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే పథకాలు అమలు చేసిన ఘనత దక్కిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పక్కన పెట్టి కక్ష సాధించే పరిపాలన చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి చలంచర్ల సుధారాణి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హిజ్రాలకు గుర్తింపు ఇచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పాలన సాగిందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షులు ఉయ్యూరి అప్పిరెడ్డి, మండల అధ్యక్షులు అన్నపురెడ్డి రఘురామిరెడ్డి, వేమూరు, అమర్తలూరు మండలాల పార్టీ అధ్యక్షులు దాది సుబ్బారావు, హిమ చంద్ర శ్రీనివాసరావు, ఎంపీపీ జాలాది రూబేను, రాపర్ల నరేంద్ర, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోగంటి లవకుమార్, జెడ్పీటీసీ సభ్యులు దాట్ల సౌజన్య మోహన్రెడ్డి, బి. నాంచారమ్మ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు
అంబటి రాంబాబు

జగన్ పర్యటనలు అడ్డుకునేందుకు బాబు కుట్ర