
వ్యాపారవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత
గుంటూరు మెడికల్: వ్యాపార వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరు భాస్కరరావు అన్నారు. ఇటీవల నవ్యాంధ్ర ప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న గుడివాడ జయకుమార్, కార్యదర్శి ఎం.కోటేశ్వరరావు, కోశాధికారి వై.బి.శివారెడ్డిల ప్రమాణ స్వీకారం ఆదివారం పలకలూరు రోడ్డులోని గుంటూరు క్లబ్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పొట్లూరు భాస్కరరావు నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. అసోసియేషన్ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న గుడివాడ జయకుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. భవిష్యత్తులో అసోసియేషన్ తరఫున నూతన భవంతిని నిర్మించి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు.