వైఎస్సార్‌ సీపీ లీగల్‌ విభాగం పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ లీగల్‌ విభాగం పాత్ర కీలకం

Jun 30 2025 3:57 AM | Updated on Jun 30 2025 3:57 AM

వైఎస్సార్‌ సీపీ లీగల్‌ విభాగం పాత్ర కీలకం

వైఎస్సార్‌ సీపీ లీగల్‌ విభాగం పాత్ర కీలకం

పట్నంబజారు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి లీగల్‌ విభాగం ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ లీగల్‌ విభాగం రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన అంబటిని ఆదివారం సత్కరించారు. అరండల్‌పేటలోని లీగల్‌ విభాగం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ముందుగా న్యాయవాదులు, లీగల్‌ విభాగం నేతలు అంబటిని సత్కరించి, అభినందనలు తెలిపారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించిన నేపథ్యంలో లీగల్‌ విభాగం సన్మానించటం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. గతంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు లీగల్‌ విభాగం కృషి ఎనలేనదన్నారు. 2024 ఎనికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, కూటమి పెట్టే ప్రతి అక్రమ కేసుపై లీగల్‌ విభాగం ద్వారా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సైతం న్యాయవాదుల కృషి ఎంతగానో ఉండబోతోందన్నారు.

మహత్తర శక్తిగా లీగల్‌ విభాగం

ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి కుట్రలను చేధిస్తూ.. వైఎస్సార్‌ సీపీ నేతల నుంచి కార్యకర్తల వరకు తామున్నామనే ధైర్యాన్ని కలిస్తున్న న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలో వచ్చిన తరువాత జరుగుతున్న దారుణాలను ఎదుర్కొనేందుకు ఒక మహత్తర శక్తిగా లీగల్‌ విభాగం పనిచేస్తోందన్నారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయవాదులకు మంచి చేసేలా వైఎస్‌ జగన్‌ అనేక గొప్ప నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పార్టీ లీగల్‌ విభాగం రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో లీగల్‌ విభాగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. గుంటూరు పశ్చిమలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురువేసేందుకు న్యాయవాదుల ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. కూటమి పాలనలో అనేక అక్రమ కేసులు చూస్తున్నామని, వాటిపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ లీగల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్‌, కొమ్మారెడ్డి కృష్ణారెడ్డి, సయ్యద్‌ బాబు, సోమసాని ఝాన్సీ, మంజుల, పోకల వెంకటేశ్వర్లు, హబీబుల్లా, వాసం సూరిబాబు, లలిత, వరదాయని, శ్యామల, ఇందిరా, శ్రీనివాసరెడ్డి, కళ్లం రమణారెడ్డి, సింగ్‌, బొమ్మనబోయిన శ్రీను, వజ్రాల రాజశేఖరరెడ్డి, బ్రహ్మారెడ్డి, కాసు వెంకటరెడ్డి, క్రాంతి, వేముల ప్రసాద్‌, స్వదీప్తి, తార, అబ్రహాం లింకన్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా

అధ్యక్షుడు అంబటి రాంబాబు

లీగల్‌సెల్‌ ఆధ్వర్యంలో

అంబటికి సత్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement