చేరికలు | - | Sakshi
Sakshi News home page

చేరికలు

Jun 30 2025 4:13 AM | Updated on Jun 30 2025 4:13 AM

చేరిక

చేరికలు

ముందుచూపు
179 స్కూళ్లలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: పాఠశాల విద్యారంగంలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయోగాలు వికటిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలు లేక మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరని పాఠశాలలే ఇందుకు ఉదాహరణ. పల్నాడు జిల్లావ్యాప్తంగా 179 ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటివరకూ ఒకటో తరగతిలో కనీసం ఒక్క విద్యార్థి సైతం చేరకుండా ఉండటం విద్యారంగ చరిత్రలో ఇదే మొదటిసారి.

దీనావస్థలో ప్రభుత్వ విద్య

విలీనం పేరుతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో కలిపేయడం, మోడల్‌ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు అంటూ ప్రాథమికస్థాయిలో విద్యార్థులకు విద్యను దూరం చేయడం వంటి కారణాలతో ఒకటో తరగతిలో విద్యార్థుల ప్రవేశాలు లేక పాఠశాలలు దీనావస్థలోకి వెళ్లిపోయాయి. ఈ విధంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలను పరిశీలిస్తే ఒక పల్నాడు జిల్లాలోనే 179 పాఠశాలలు ఉండటం గమనార్హం.

వికటించిన ప్రయోగాలు

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో సంబంధిత పాఠశాలల్లోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో విలీనం చేసిన కూటమి ప్రభుత్వం మోడల్‌ ప్రైమరీ పేరుతో కొత్తగా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేసింది. గ్రామంలోని వేర్వేరు కాలనీల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న నాలుగైదు ప్రాథమిక పాఠశాలల స్థానంలో ఒకటే పాఠశాల ఉండాలనే ప్రభుత్వ విధానంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకే దూరమయ్య పరిస్థితులు ఏర్పడ్డాయి.

పల్నాడు జిల్లాలోని 179 పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థీ చేరని వైనం పాఠశాల విద్యలో ప్రభుత్వ ప్రయోగాల ఫలితం మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ప్రభావంతో గ్రామాల్లో ప్రైమరీ పాఠశాలలు మూత పడే ప్రమాదం వైఎస్సార్‌ సీపీ పాలనలో సజావుగా కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు

చేరికలు1
1/1

చేరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement