
వైభవంగా పునీత పేతురు మహోత్సవం
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని బాల ఏసుదేవాలయంలో ఆదివారం శ్రీసభ కార్యక్రమం నిర్వహించారు. పునీత పేతురు, పాల్ల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దేవాలయ విచారణ గురువులు ఎం.ఫాతిమా మర్రెడ్డి దివ్యపూజాబలి కార్యక్రమం నిర్వహించి వాక్యోపదేశం చేశారు. పునీత పేతురు, పాల్లు తమ జీవితంలో భగవంతుడిపై విశ్వాసాన్ని ఏవిధంగా చూపి నిలుపుకున్నారో దానిని విశ్వాసులు తెలుసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఒకే కుటుంబంగా కలిసి ప్రార్థనలు చేయాలని చెప్పారు. అనంతరం దివ్యపూజాబలి నిర్వహించారు. కార్మెల్ మాత మహోత్సవం జూలై 14,15,16 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సహాయ విచారణ గురువులు, మఠకన్యలు, కథోలిక క్రైస్తవులు పాల్గొన్నారు.