
ఆగని మట్టి దందా
అంతా షాడో కనుసన్నల్లోనే..
తాడికొండ: అధికారుల అలసత్వం, నాయకుల పైరవీల కారణంగా తాడికొండ మండలం ఫణిదరం గ్రామంలో తెలుగు తమ్ముళ్ల మట్టిదందా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. గ్రామంలోని మంచినీటి చెరువులో తవ్వకాలు చేస్తూ టన్నుల కొద్దీ మట్టిని ట్రాక్టర్లు, లారీలలో రాత్రీ, పగలు తేడా లేకుండా తరలిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు గుంటూరు కలెక్టరేట్కు వెళ్లి మరీ ఫిర్యాదు చేసినా ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
మట్టిదందా అంతా నియోజకవర్గ ముఖ్య నేతకు చెందిన కార్యాలయంలో ఉంటున్న ఓ వ్యక్తి కనుసన్నల్లో కొనసాగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతా ఆయనే అయి షాడో ఎమ్మెల్యేగా వ్యవహారం నడిపిస్తూ జేబులు నింపుకొంటుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప తామేం చేయలేకపోతున్నామంటూ టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఇప్పటికే అధికారులను సైతం బెదిరించి తన వశం చేసుకున్న సదరు వ్యక్తి.. ప్రజా సమస్యలు పక్కన బెట్టి మట్టి దందాకు నియోజకవర్గంలో భారీగా తెరలేపాడు. ఇక్కడ అక్కడ అనే బేధం లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా తమవారిని తెరపైకి తెచ్చి భారీగా మట్టి దందా నిర్వహిస్తున్నాడు. ఫిరంగిపురం మండలం అమీనాబాద్లో మరింత బరి తెగించి దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో భారీగా తవ్వకాలు జరపడం వెనుక షాడో ఎమ్మెల్యే హస్తం ఉందని ఇప్పటికే పలువురు టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మట్టి దందాకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తాడికొండ మండలం ఫణిదరంలో నెల రోజులుగా యథేచ్ఛగా మట్టి దోపిడీ చేస్తున్న కూటమి నేతలు షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో వ్యవహారం చెరువులో ఏర్పడిన భారీగుంతలు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు గుంటూరుతో సహా పరిసర గ్రామాలకు భారీగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్న వైనం

ఆగని మట్టి దందా