
ఎస్సీ వెల్ఫేర్లో ఇవి మామూళ్లే!
నెహ్రూనగర్: గుంటూరు జిల్లా పరిషత్ సమీపంలోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారింది. ఇక్కడి ఉన్నతోద్యోగులు కింది సిబ్బందిని జలగల్లా పీడిస్తున్నారు. ఏ పని చేయాలన్నా ఎంతో కొంత ముట్టచెబితేనే ఫైల్ ప్రాసెస్ అవుతుంది. లేకుంటే ఆ ఫైల్ అలాగే రోజులు, నెలల తరబడి పెండింగ్లో ఉంటుంది. దీంతో చాలా మంది ఉద్యోగులు వారు అడిగినంత ఇచ్చుకోలేక, పనులు కాక ఇబ్బందులు పడుతున్నారు.
ఇంక్రిమెంట్లు వేయాలంటే సమర్పించుకోవాల్సిందే...!
ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల ఇంక్రిమెంట్లు, ఎస్ఆర్ ఎంట్రీలు, పే ఫిక్సేషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర బిల్లులు ఇలా అన్ని రకాల పనులకు ఒక రేటు ఫిక్స్ చేసి వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వినికిడి.
ఉన్నతాధికారులు పట్టించుకోరే ?
కార్యాలయంలో ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న అంశాలపై ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వెల్ఫేర్ శాఖకు రెగ్యులర్ డీడీ మధుసూధన్రావు గత కొద్ది నెలలుగా లాంగ్ లీవ్లో ఉండటంతో పాటు ప్రస్తుతం ఈ శాఖకు బాపట్ల ఎస్సీ వెల్ఫేర్ అధికారిని ఇన్ఛార్జ్ డీడీగా నియమించారు. కార్యాలయంలో జరిగే అన్ని విషయాలకు గతంలో ఇక్కడ పనిచేసిన డీడీ అండదండలు ఉన్నాయని క్లాస్–4 ఉద్యోగులు బహిరంగంగానే మాట్లాడుకోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
అవినీతికి కేరాఫ్గా ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయం సిబ్బందిని జలగల్లా పీడిస్తున్న ఉన్నతోద్యోగులు పే స్కేల్స్, ఇంక్రిమెంట్లు వేయాలన్న ముడుపులు ఇచ్చుకోవాల్సిందే మామూళ్లు ఇచ్చుకుంటేనే ఫైల్ కదిలేది లబోదిబోమంటున్న ఉద్యోగులు
నా దృష్టికి రాలేదు
కార్యాలయంలో ఉద్యోగులకు అవసరమైన పనులు చేయాలంటే మామూళ్లు అడుగుతున్న విషయం నా దృష్టికి రాలేదు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.
– రాజా దెబోరా,
డిప్యూటీ డైరెక్టర్, ఎస్పీ వెల్ఫేర్