
7న శంకర్విలాస్ ఆర్ఓబీ పనులకు శంకుస్థాపన
నెహ్రూనగర్: ఈ నెల 7వ తేదీన శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల శంకుస్థాపన జరుగుతుందని, విస్తరణ పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో కలిసి శంకర్ విలాస్ ఆర్ఓబీ రోడ్డు విస్తరణ పనులను కమిషనర్ పరిశీలించారు. తొలుత ఆర్ఓబీ నిర్మాణ డిజైన్ను పరిశీలించి, ఇప్పటివరకు జరిగిన విస్తరణ పనులు, మార్కింగ్ అంశాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ఆర్ఓబీ నిర్మాణ పనుల శంకుస్థాపన చేస్తారన్నారు. శంకుస్థాపన జరిగే ప్రదేశం నిర్ణయం అనంతరం శిలాఫలకం ఏర్పాట్లను ఆర్అండ్బీ అధికారుల సమన్వయంతో చేయాలన్నారు. ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, డీసీపీ సూరజ్ కుమార్, ఆర్అండ్బీ డీఈఈ చిన్నయ్య, ఏఈఈ సంజీవ కుమార్, ఏసీపీలు, పట్టణ ప్రణాలిక, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
‘నీట్’ ఏర్పాట్లు పరిశీలన
గుంటూరు ఎడ్యుకేషన్: నీట్ పరీక్ష కేంద్రాలను శనివారం డీఆర్ఓ ఎన్ఎస్ ఖాజావలి, డీఈఓ సీవీ రేణుక పరిశీలించారు. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన వారు విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చీఫ్ సూపరింటెండెంట్తో చర్చించారు. హెచ్ఎం షేక్ ఎండీ ఖాసిం ఉన్నారు.

7న శంకర్విలాస్ ఆర్ఓబీ పనులకు శంకుస్థాపన