ఏలూరు(మెట్రో): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ఎన్జీజివో సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏలూరు ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలు ఏలూరు జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావుల ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ గాయత్రి, సీడీపీఓ తులసి, డీసీపీఓ డాక్టర్ సూర్యచక్ర వేణి. మహిళా విభాగం ఛైర్పర్సన్ కె.సునీత, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు తోట కుసుమకుమారిలు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు సత్య భారతి, సత్య శ్రీ, వెంకట లక్ష్మి, కృష్ణవేణి, రజిత, ఎన్టీపీఏ కె.శేషమ్మ, నాగమణి, జ్యోతి, పద్మావతి తదితరులుపాల్గొన్నారు.
రింగ్ గేమ్ ఆడుతున్న మహిళా ఉద్యోగులు
కబడ్డీ ఆడుతున్న మహిళా ఉద్యోగులు


