అలరించిన నాట్య విన్యాసాలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన నాట్య విన్యాసాలు

Sep 14 2025 3:11 AM | Updated on Sep 14 2025 3:11 AM

అలరించిన నాట్య విన్యాసాలు

అలరించిన నాట్య విన్యాసాలు

అలరించిన నాట్య విన్యాసాలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరానికి చెందిన నటరాజ నాట్య కళాకేంద్రం, కళాదీపిక నృత్య అకాడమీ, శ్రీశ్రీ కల్చరల్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 12వ జాతీయ స్థాయి నృత్య అవార్డుల ప్రదాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వైఎంహెచ్‌ఏ హాలులో ఈ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకూ కొనసాగింది. 150 మంది చిన్నారులు చేసిన నృత్య విన్యాసాలు మంత్రముగ్ధులను చేశాయి. 20 మంది నృత్య గురువులకు నాట్య విదాత అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు ఎన్‌.రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎంతోమంది చిన్నారులను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాట్య గురువు వేదాంతం రాధేశ్యామ్‌, కళారత్న ఏ.పార్వతి రామచంద్రన్‌, నాట్యాచార్య డీ.హేమసుందర్‌ అతిథులుగా పాల్గొనగా, నటరాజ నాట్య కళాకేంద్రం నిర్వాహకురాలు ఎన్‌.కృష్ణవేణి కార్యక్రమాలు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement