
సోమారామంలో ఆదాయం లెక్కింపు
భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామ క్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం (సోమారామం)లో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.10,50,655 నగదు లభించిన్నట్లు ఈఓ డి.రామకృష్ణంరాజు తెలిపారు.. నిత్యాన్నదానానికి రూ.18,886 లభించిందన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం: గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులకు అవార్డులు అందించనున్నామని, ఈనెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఈ.నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారు అర్హులన్నారు. ఽ16న తుది జాబితా రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని, 21 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయిలో ఎంపికై న ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 25న ఎంపికై న వారి తుది జాబితాను విడుదల చేస్తారని నారాయణ తెలిపారు.