300 కేజీల రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

300 కేజీల రేషన్‌ బియ్యం స్వాధీనం

Oct 22 2025 7:08 AM | Updated on Oct 22 2025 7:08 AM

300 కేజీల రేషన్‌ బియ్యం స్వాధీనం

300 కేజీల రేషన్‌ బియ్యం స్వాధీనం

అమలాపురం టౌన్‌: ముమ్మిడివరం గేటు సెంటర్‌లోని శ్రీలలిత రైస్‌ స్టోర్స్‌పై మంగళవారం సివిల్‌ సప్లయిస్‌ అధికారులు దాడి చేశారు. ఆ షాపు యాజమాని రాంబాబు నుంచి 300 కేజీల (ఏడు బస్తాలు) రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, అతడిపై 6ఏ కేసు నమోదు చేశారు. సివిల్‌ సప్లయిస్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కడలి ఈశ్వరి, జిల్లా కార్యాలయం ఏఎస్‌వో శరత్‌ సంయుక్తంగా ఈ దాడి నిర్వహించారు. షాపులో రికార్డులను తనిఖీ చేసి, స్టాక్‌కు అదనంగా రేషన్‌ బియ్యం ఉన్నట్టు గమనించారు. రాంబాబు తన షాపులో అమ్మకం కోసం తరచూ రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తునట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement