
హుండీల ఆదాయం లెక్కింపు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో జగన్మోహినీ కేశవ, గోపాలస్వామి, ఉమా కమండలేశ్వర స్వామివారి ఆలయాల హుండీలను ఆరు నెలల 19 రోజుల అనంతరం బుధవారం తెరిచి నగదు లెక్కించారు. ఆయా దేవస్థానాల ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో రావులపాలెం మండలం పొడగట్లపల్లి ఉప్పలపాటి జానకమ్మ అన్నదాన సత్రం ఈఓ మీసాల రామకృష్ణ పర్యవేక్షణలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో హుండీల ఆదాయం లెక్కించారు. జగన్మోహినీ కేశవ స్వామి ప్రధాన హుండీల ద్వారా రూ 8.29.515, అన్నదానం హుండీల ద్వారా రూ.3,67,275, విదేశీ యూఎస్ఏ 100 డాలర్ 1, 10 డాలర్లు మూడు, 5 డాలర్లు పది, 1 డాలర్ 59, సింగపూర్ 10 డాలర్లు 1, యూఏఈ 5 దినారం ఒకటి వచ్చినట్టు ఈఓ తెలిపారు. అలాగే ఉమా కమండలేశ్వరస్వామి ఆలయం హుండీల ద్వారా రూ.2,64,918 ఆదాయం సమకూరిందన్నారు.