అవార్డులతో బాధ్యత మరింత పెరిగింది | - | Sakshi
Sakshi News home page

అవార్డులతో బాధ్యత మరింత పెరిగింది

Oct 7 2025 3:39 AM | Updated on Oct 7 2025 3:39 AM

అవార్డులతో బాధ్యత  మరింత పెరిగింది

అవార్డులతో బాధ్యత మరింత పెరిగింది

రాజమహేంద్రవరం సిటీ: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు సాధించడం ఆనందదాయకమని, ఈ అవార్డులు మనందరి బాధ్యతను మరింతగా పెంచాయని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి అన్నారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అవార్డుల కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో జిల్లాకు మూడు రాష్ట్ర స్థాయి, 51 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని చెప్పారు. ఆయా అధికారులు, సంస్థల ప్రతినిధులకు ఈ అవార్డులను ఆమె అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ముప్పిడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జేసీ మేఘస్వరూప్‌, ఆర్‌డీఓ ఆర్‌.కృష్ణనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement