
బాబు పాలనలో దళితులకు అన్యాయం
చంద్రబాబు పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలు నిర్వహించాలి. అప్పుడే దళితులు, పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువవుతుంది. పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడితే పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారుతుంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు దారుణం. పేదలు వైద్య విద్య అభ్యసించాలంటే రూ.లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే ఆ అవసరం ఉండదు. ఏ కులంలోని పేదవారికై నా ప్రభుత్వ ఆసుపత్రులు పెద్దాసుపత్రులుగా కనిపిస్తాయి. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – సాలి వేణు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు